నెల్లికుదురు, అక్టోబర్ 18: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇటీవల విద్యుదాఘాతంతో 6 పశువులు మృతి చెందగా రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాధిత రైతులకు ఒక్కొక్కరికి రూ. 40వేల చెక్కులను అందజేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సమైక్య పాలనలో కరంట్ కష్టాలను, విద్యుత్ షాక్తో పశువులు మృతి చెందితే పట్టించుకునేవారు లేరన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినా ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందని వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధితో బాధితులకు ఆర్థిక ఇబ్బందులు తీరుస్తున్నారని తెలిపారు. త్వరలో జరుగనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రణాళికా బద్ధంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వస్రాం తండాకు చెందిన గుగులోత్ లచ్చు, వీరన్న, శంకర్, కిషన్, రవి, రెడ్యాకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్రెడ్డి, దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యా సం రమేశ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీనాయక్, మండల కోఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు ఆకుల జగ్గయ్య, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్గం చంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్, నాయకులు విజయ్ యాదవ్, మాన్సింగ్, దాసరి ప్రకాశ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మహబూబాబాద్: మండలంలోని వీఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన అనిత అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ. 3లక్షల విలువైన చెక్కును అనిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద బాధపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, వారిని ఆదుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మార్నేని వెంకన్న, రఘు, గద్దె రవి, అశోక్, ఆవుల వెంకన్న, ఈశ్వర్, రవిచంద్ర, రామన్న, రమేష్, నరేశ్ పాల్గొన్నారు.