లింగాలఘనపురం, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలోని దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. సీమాంధ్ర పాలనలో దేవాలయాలు సైతం జీర్ణావస్ధకు చేరుకున్నాయ న్నాయని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. దేవాదాయశాఖ పరిధిలోకి చేరిన ఆలయాలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. రాజకీయాలనేవి కేవలం ఎన్నికల వరకే పరిమిత మవ్వాలన్నారు. అనంతరం అందరూ గ్రామాభివృద్ధికి కలసి కట్టుగా శ్రమించా లన్నారు.
గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు
కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి సర్పంచ్ తుంగ స్రవంతి విజ్ఞప్తి మేరకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు మరికొన్ని నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
అభివృద్ధిని ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని రాజయ్య అన్నారు. తాము ఇప్పటి వరకూ ఎంతో ఓపికగా ఉన్నామని చెప్పారు. సహనానికి ఓ హద్దు ఉంటుందని, సరైన సమయంలో సరైన రీతిలో స్పందించి విమర్శకులకు సరైన సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి బొల్లంపల్లి నాగేందర్, కొమురవెల్లి దేవస్ధాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్, మండల కార్యదర్శి గవ్వల మల్లేశం, నాయకులు దూసరి గణపతి, గండి మంగవ్వయాదగిరి, ఏదునూరి వీరన్న, సొసైటీ చైర్మన్లు మల్గ శ్రీశైలం, బుషిగంపల ఉపేందర్గౌడ్, కొత్తకొండ గంగాధర్, దాయ ఉపేందర్, బుషిగంపల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.