19వ వసంతంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు వీణా-వాణి
దంతాలపల్లి, అక్టోబర్16 : తల లు అతుక్కొని పుట్టిన ఆ ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండాయి. అవిభక్త కవలలుగా తల్లిదండ్రులకు తీరని ఆవేదనగా మిగిలారు. వారు విడివడిగా అందరిలా హాయిగా తిరుగాలని కుటుంబసభ్యులతోపాటు ప్రతిఒక్కరూ నిండు మనసుతో కోరుకుంటూనే ఉన్నారు. అవిభక్త కవలలు వీణా-వాణి శనివారం 19వ వసంతంలోకి అడుగుపెట్టారు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జన్మించిన వారు పుట్టుకతోనే తలల అతుక్కుని కవలలుగా జన్మించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కూతుళ్లు. మొదటి కుమార్తె బిందు, కాగా రెండో సంతానంలో వీణా-వాణి, నాలుగో సంతానంలో సింధు జన్మించారు. వీణా-వాణిలకు శస్త్రచికిత్స కోసం 2003 నుంచి వివిధ దేశాలు, రాష్ర్టాలు తిప్పినా ఫలితం లేకండా పోయింది. ప్రస్తుతం వాళ్లు హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనంలో చిల్డ్రన్ హోమ్లో ఉంటూ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
పిల్లలతో ఉండేలా చూడాలి
: వీణా-వాణి తల్లిదండ్రులుమారగాని మురళి-నాగలక్ష్మి
తమ అవిభక్త కవలలు వీణా-వాణిలు పెద్దవాళ్లు అవుతున్నారు. ముందుముందు ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థతులు ఉన్నాయి. తాము తమపిల్లలతో కలిసి ఉండేలా ప్రభుత్వం ఉపాధి కల్పించాలి.