డోర్నకల్, అక్టోబర్ 16: పెట్రో, నిత్యావసర సరుకుల ధరల పెంపునకు నిరసనగా మండల కేంద్రంలోని మసీద్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా దిష్టి బొమ్మలను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఉప్పెనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, స్టీల్ ప్లాంట్లు, బ్యాంకులు, నౌకాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి దాసరి మల్లేశం, మండల నాయకులు బొమ్మన అశోక్, జేవీఆర్, రమేశ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం: మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో అఖిల పక్ష నాయకులు శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భగా గౌని ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మండా రాజయ్య, బిల్లకంటి సూర్యం, జగన్న, ముసలయ్య, సత్యం, మధార్, శ్రీను పాల్గొన్నారు.
గార్ల: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని చేపల మార్కెట్ సెంటర్లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ న్విహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్షా దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో సామన్య ప్రజలపై భారం పడుతోందని, బీజేపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్ని పేర్కొన్నారు. ఈ నెల 18న చేపట్టే దేశ వ్యాప్త రైలు రోకోను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు నాడేళ్ల శ్రీనివాస్, షర్ఫొద్దీన్, గౌని మల్లేశ్, గోసు బజరయ్య, బావ్సింగ్ పాల్గొన్నారు.