జఫర్గఢ్, జూలై 16: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లోని పూర్తి సమాచారాన్ని యూడైస్ ఫారాల్లో నమోదు చేయాలని సెక్టోరియల్ అధికారులు(యూడైస్ వెరిఫికేషన్ టీం) నరసింహరావు, సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని రఘునాథపల్లి, కూనూరు, సాగరం, కేజీబీవీ, మోడల్ స్కూల్, జఫర్గఢ్ లోని ప్రభుత్వ పాఠశాలలను అధికారులు సందర్శించారు. ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించే విధానాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేందర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు రామకృష్ణ, మల్లారెడ్డి, తామసమ్మ, స్వప్న, శ్రీకాంత్, శ్రీలత తదితరులు ఉన్నారు.
పాఠశాలల తనిఖీ
దేవరుప్పుల : జల్లా విద్యాధికారి ఆదేశాలమేరకు మండలంలోని పలు పాఠశాలలను శుక్రవారం జిల్లా మానిటరింగ్ అధికారులు తనిఖీ చేశారు. ధర్మగడ్డ తండా ప్రాథమికోన్నత పాఠశాల, ధరావత్ తండా ప్రాథమిక పాఠశాల, కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లోని రికార్డులను మానిటరింగ్ అధికారులు ఎం.మల్లికార్జున్, తోట రాజు పరిశీలించారు. యూ-డైస్ ఫార్మెట్లు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. మౌలిక వసతులు, కావాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీఆర్పీ యాకస్వామి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జోగు వరప్రసాద్, అరుణ, ఉషారాణి తదితరులు ఉన్నారు.