వర్ధన్నపేట, అక్టోబర్ 14 : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించి గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి, చె న్నారం గ్రామాల్లో బతుకమ్మతల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రా మాల్లో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రజల కో సం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అ నంతరం వర్ధన్నపేట పట్టణం, కొత్తపల్లి గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ల్యాబర్తి గ్రామం లో బతుకమ్మ ఎత్తుకొని మహిళలను ఉత్సాహపరిచారు. ఆయా కార్యక్రమా ల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, ల్యాబర్తి సర్పంచ్ పస్తం రాజు, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు, ఎంపీటీసీ ఉమాదేవి, చెన్నారం సర్పంచ్ పునుగో టి భాస్కర్రావు, ఉపసర్పంచ్ రాజమౌ ళి తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అండగా ఉంటా..
కరీమాబాద్ : క్రీడాకారులకు అండ గా ఉంటానని ఎమ్మెల్యే అరూరి అన్నా రు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీల్లో బంగారు పతకం సాధించిన 43వ డివిజన్ తిమ్మాపూర్కు చెందిన మ్యాకల శ్రీకాంత్ను సత్కరించారు. శ్రీ కాంత్ ప్రయాణ ఖర్చుల కోసం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా రూ. 10 వేల ఆర్థికసాయం అం దించినట్లు తెలిపారు.
బతుకమ్మ విగ్రహం ఆవిష్కరణ..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని దేవతగా పూజించే గొప్ప సం స్కృతి మన తెలంగాణ ఆడబిడ్డలదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అ న్నారు. 43వ డివిజన్ పరిధిలోని గణేశ్ నగర్ మంగళమ్మకుంటలో ఏర్పాటు చే సిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రకృతి సిద్ధంగా లభించిన పూల తో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలో నే ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ, గుండు చందన, 39వ డివిజన్ కార్పొరేటర్ పో శాల పద్మ, గణేశ్నగర్ ఉత్సవ కమిటీ అ ధ్యక్షుడు మడూరి సోమయ్య, గౌరవ అధ్యక్షుడు గోవిందం దామోదర్, ప్రధా న కార్యదర్శి పరికిపండ్ల సదానందం, కోశాధికారి అబ్బరబోయిన సాంబయ్య, సభ్యులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అం దించాల్సిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే అరూరి అన్నారు. మండలంలోని దౌలత్నగర్లో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, రతన్రావు, సర్వర్, గోపి, కొమురయ్య, వెం కన్న, శ్రీను, యాకయ్య, పీఏసీఎస్ చైర్మ న్ మనోజ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పం తులు తదితరులు పాల్గొన్నారు.