నమస్తే తెలంగాణ నెట్వర్క్ : అమ్మలగన్న అమ్మ.. దుర్గమ్మ.. లోక కల్యాణం కోసం అపరకాళికగా మారి మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదని, ఏ నాటికైనా చెడుపై మంచిదే గెలుపని నిరూపించింది. సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత.. త్రిలోకేశ్వరి సకలాభీష్ట ప్రదాయిని దుర్గామాత దుష్ట శిక్షణ గావించిన రోజున విజయ దశమి పండుగను నిర్వహించుకుంటున్నాం. దేవీ భాగవతం ప్రకారం మహిషాసురుడు బ్రహ్మ వరం వల్ల గర్వితుడై ముల్లోకాలను బాధ పెడుతుండే వాడు. అతని బాధలు పడ లేక దేవతలు త్రిమూర్తులను, సకల లోక పావని దుర్గామాతను స్తుతించారు. అ ప్పుడు దుర్గామాత తొమ్మిది రోజుల పాటు భీకర పోరా టం సాగించి పదో రోజు మహిషుని సంహరిస్తుంది. ఆరోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి. అందుకే దుష్టునిపై విజయంగా భావించి విజ య దశమిగా మారినట్లు పురాణాలు ప్రవిచిస్తున్నా యి. చెడుపై ‘మంచి’ సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. దేవాలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు చోట్ల రావణవధ కోసం ఏర్పాట్లు చేశారు. ఆయుధపూజ, వాహన పూజ, శమీపూజలు చేసి పెద్దల దీవెనలు తీసుకోనున్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటారు. పాలపిట్టను చూస్తే ఏడాది పొడవునా శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.