ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పొనకల్, గురిజాలలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
దుగ్గొండి, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ దళుతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మండలంలోని పొనకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పెద్ది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ బొమ్మగాని ఊర్మి ళ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీ బండి జగన్నాథం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
నర్సంపేట రూరల్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని గురిజాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ సేవలందించారని గుర్తుచేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహ దాత, టీఆర్ఎ స్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డి, నర్సంపేట ఏసీపీ ఫణీందర్, నర్సంపేట, చెన్నారావుపేట ఎస్ఐలు నవీన్కుమార్, శీలం రవి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండా రు శ్రీలత, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, చిన్న గురిజాల, లక్నేపల్లి, జీజీఆర్పల్లి గ్రామాల సర్పంచ్లు గడ్డం సుజాత, గొడిశాల రాంబాబు, తుత్తూరు కోమల, నాయకులు గొడిశాల సదానందంగౌడ్, ఆముదాల రమేశ్, బండారు రమేశ్, గడ్డం రమణ, నర్సింగం, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, జనగాం నవీన్, అల్లి రాజ్కుమార్, అల్లి రవి, కొమురయ్య పాల్గొన్నారు.