రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ అందుతున్న సంక్షేమ ఫలాలు
మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నా యని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ప్లవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన గుండ్రాతిమడుగు పెద్దతండాలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం గుండ్రాతిమడుగులోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ఆర్థిక అవసరాలు తెలుసుకొని తీర్చే ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టంగా భావించాలన్నారు. ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్కు మరింత ఆయువు, శక్తి సామర్థ్యాలను ప్రసాదించి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని దేవుడిని వేడుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడి దేవుళ్ల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థితిలో ఉన్నానని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ సాధించిన కేసీఆర్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం మేటి అనే పేరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బిందు, జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు శ్రీనివాసరెడ్డి, మధుకర్రెడ్డి, రవీందర్, బోడ శ్రీను, శ్రీకాంత్నాయక్, వనజాశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.