వర్ధన్నపేట/పర్వతగిరి, ఆగస్టు 12: నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ ప్రతినిధులు గ్రామాల్లో రైతులకు మెరుగైన సేవలందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఆత్మ కమిటీ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, సభ్యులు గురువారం ఎమ్మెల్యేను హన్మకొండ ప్రశాంతినగర్లోని ఆయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆత్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. సభ్యులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఆత్మ కమిటీ నూతన సభ్యులు మునుకుంట్ల సంతోష్, నూనె అశోక్, మన్నూరు సోము, ముత్యం సాంబయ్య, తోటకూరి శ్రీధర్, మడిపెద్ది చంద్రమౌళి, నునావత్ వసంత్నాయక్, సీహెచ్ ప్రభాకర్, బీ కుమారస్వామి, జే రాజు, సీహెచ్ కొమురమ్మ, సంకినేని నవీన్, చౌడ సుధాకర్, ఏ సతీశ్, పాక సుజాత, పేర్వారం హైమావతి పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరి మండలంలోని ఆత్మ డైరెక్టర్లు చెడుపాక ప్రభాకర్, చిన్నపాక శ్రీనివాస్, చౌద సుధాకర్, పేరువరం హైమావతి, బుక్క కుమారస్వామి, గొప్పగాని రాజు, జీడి మల్లయ్య అరూరిని కలిశారు. వారి వెంట ఎంపీపీ లునావత్ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ ఎం మనోజ్గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు పాల్గొన్నారు.