విద్యార్థులకు రేపు ‘నాస్’ టెస్ట్
జయశంకర్ జిల్లాలో 115 కేంద్రాలు
హాజరుకానున్న 18,194 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు
క్షేత్ర పరిశీలకులుగా 98 మంది ఛాత్రోపాధ్యాయులు
భూపాలపల్లి రూరల్, నవంబర్ 10 : విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ సాధన (నేషనల్ అచీవ్మెంట్) సర్వేకు శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠ్యాంశాలు బోధించిన విషయం తెలిసిందే.. కాగా కొవిడ్ తీవ్రత తగ్గి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు 12న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3,5,8,10వ తరగతుల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జయశంకర్ జిల్లాలోని 115 పాఠశాలలను ఎంపిక చేయగా, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశ వ్యాప్తంగా 3,5,8,10వ తరగతి చదువుచున్న విద్యార్థుల విజ్ఞాన సామార్థ్యాలను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ సాధన సర్వే (నేషనల్ అచీవ్మెంట్ సర్వే)ను నిర్వహించడానికి శ్రీకారం చుట్టుంది. కరోనా వైరస్ కారణంగా సుమారు రెండేళ్ల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగకపోవడంతో ఉపాధ్యాయలు ఆన్లైన్లో పాఠ్యంశాలు బోధించిన విషయం తెలిసిందే.. కొవిడ్ తీవ్రత తగ్గి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థుల సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? ఏం నేర్చుకున్నారు? వారి స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభు త్వం జాతీయ సాధన సర్వే పేరుతో రేపు (నవంబర్ 12) ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 3,5,8,10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 115 పాఠశాలలను శాంపిల్స్గా తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హాజరుకానున్న 18,194 మంది విద్యార్థులు
జిల్లాలోని 115 పాఠశాలలను శాంపిల్స్గా తీసుకుని ఆయా పాఠశాలల్లోని 18,194 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 3వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులు 1437, ఇంగ్లిష్ మీడియం3822 మంది, 5వ తరగతిలో తెలుగు 1346 మంది, ఇంగ్లిష్ 3570 మంది, 8వ తరగతిలో తెలుగు 804 మంది, ఇంగ్లిష్ 3252 మంది, 10వ తరగతిలో తెలుగు మీడియం 932, ఇంగ్లిష్ మీడియం 3031 మంది విద్యార్థులు ఉన్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ డైట్, బీఎడ్ కళాశాలలకు సంబంధించిన 198 మంది ఛాత్రోపాధ్యాయులను క్షేత్ర పరిశీలకులుగా నియమించారు. ప్రొఫార్మా ప్రకారం వీరు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణను పరిశీలించడానికి 134 మంది పరిశీలకులను నియమించారు. ఈ నెల 12న జరిగే నాస్ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు 3,5 తరగతుల విద్యార్థులకు, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 8, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు.
సామర్థ్యాలను అంచనా వేసేందుకే..
విద్యార్థుల విజ్ఞాన సామర్థ్యాలను అంచనా వేసేందుకే నాస్ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశాం. చదువుల్లో లోపాలను తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుంది. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి దోహదం చేస్తుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా పాఠ్యాంశాలకు అవసరమైన శిక్షణ కల్పించనున్నారు.
-మనోహర్నాయక్, ఏఎంవో