మావోయిస్టు అగ్రనేతలకు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సూచన
మావోయిస్టు దామోదర్ తల్లిని కలిసి నిత్యావసరాలు అందజేత
ములుగు, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ లో కొనసాగుతున్న అగ్రనేతలు, సభ్యులు వ నం వీడి జనంలోకి వచ్చి జనజీవన స్ర వంతిలో కలువాలని ఎస్పీ సంగ్రామ్సింగ్ జీపాటిల్ అన్నా రు. శుక్రవారం తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే దామోదర్ తల్లి బడే బతుకమ్మను ఆమె నివాసంలో ఎస్పీ కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పోషణను అడిగి తెలుసుకుని నిత్యావసరాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రెండు నెలలుగా మా వోయిస్టు నా యకులు కరోనా వైరస్ బారిన పడి అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారన్నా రు. అజ్ఞాతంలో ఉండి కన్న వారికి, తోబుట్టువులకు దూరంగా ఉంటూ మావోయిస్టు పార్టీ ఒత్తిడితో దళంలో కొనసాగుతున్నారని తెలిపారు. ముఖ్య నేతలందరూ అనారోగ్యంతో మృతి చెం దుతున్నా కేంద్ర కమిటీ దాట వేత ధోరణి ప్రదర్శిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసే ముఖ్య నే లకు, కింది స్థాయి కేడర్కు పోలీస్ శాఖ ద్వారా అన్ని విధాలా సహకారం అందించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా దామోదర్ తల్లి బతుకమ్మ ‘ఒంటరిగా ఉండలేక పోతున్నాను ఇంటికి రా బిడ్డ నిన్ను చూడాలనిపిస్తుందని’ కన్నీటి పర్యం తం కాగా ఎస్పీ ధైర్యం చెప్పి అండగా ఉంటానని హా మీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని చిన్నారులకు ఎస్పీ మాస్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఏఎస్పీలు పోతరాజు సాయిచైతన్య, రూపే శ్, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు.