పరకాల, ఆగస్టు 4 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలు చెందిన 232 మంది లబ్ధిదారుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ చైర్ పర్సన్ ఎస్ అనితారామకృష్ణ, ఆయా మం డలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులున్నారు.
అన్నదాతల సంక్షేమమే ధ్యేయం..
రైతన్న సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పే ర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయం తో సంగెం క్లస్టర్ రైతువేదికను ప్రారంభించారు. అనంతరం 227 మంది వివిధ గ్రామాలకు చెందిన నూతన లబ్ధిదారులకు రేషన్కార్డులు, మహిళా సంఘాలకు రూ.8 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశా రు. అ నంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు అదునాత విజ్ఞానాన్ని, నిపుణుల సూచనలు, సలహాలు అందించేందుకు ప్రభుత్వం క్లస్టర్ కేంద్రాలలో రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందగట్ల కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, డీఆర్డీవో సంపత్రావు, సర్పంచ్ బాబు, ఎం పీటీ మల్లయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు నరహరి, ఏవో సీహెచ్ యాకయ్య, ఎంపీడీవో మల్లేశం, తహసీల్దార్ విశ్వనారాయణ, ఆ యా గ్రామాలకు చెం దిన సర్పంచ్లు, ఎంపీటీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.