పరకాల, జూలై 13: అవసరం ఉన్న వారు రెడ్క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ పీ రాజేశ్వరప్రసాద్ సూచించారు. నడికూడ మండలంలోని రాయపర్తికి చెందిన కడారి భాగ్యం కరోనాతో బాధపడుతుండగా ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు దృష్టి తీసుకెళ్లగా, పట్టణంలోని జనరిక్ మెడికల్ షాపులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను మంగళవారం డాక్టర్ రాజేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యుడికి అందించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బండి సారంగపాణి, పరకాల సీఐ పింగిళి మహేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి పాల్గొన్నారు.