గీసుగొండ, ఆగస్టు 4: ప్రతి స్వయం సహాయక సంఘానికీ రూ. 10 లక్షల బ్యాంకు లీంకేజీ రుణాలు అందజేస్తున్న డీఆర్డీవో సంపత్రావు అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఆయన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 5 కోట్ల రుణాల చెక్కును మండల సమాఖ్యకు అందజేశారు. అనంతరం సంపత్రావు మాట్లాడుతూ గతంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షలకు మించి రుణాలు ఇచ్చేందుకు వీలుండేది కాదన్నారు. ఇప్పుడు రూ. 10 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. తీసుకున్న రుణాలతో స్వయం సహాయక సంఘాలు వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లిస్తే వడ్డీ కూడా మాఫీ అవుతుందని వివరించారు. మండలంలో స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో సంఘాలకు అవగాహన కల్పించి రుణాలు వినియోగించుకునే తీరును వివరించాలన్నారు. కార్యక్రమంలో డీజీఎం శంకర్లాల్, ఎల్డీఎం సత్యజిత్, ఆంధ్రాబ్యాంకు గీసుగొండ బ్రాంచ్ మేనేజర్ రణధీర్, ఏపీఎం సురేశ్కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి, సీఏ శోభ, బ్యాంకు సిబ్బంది రమేశ్ పాల్గొన్నారు.