గీసుగొండ, మార్చి 29 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు సోమవారం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎండోమెంట్ అధికారుల కు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. వారం రో జుల్లో ఆలయాన్ని సందర్శించి చేయాల్సిన పనులు గుర్తించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు కూడా ఆలయాన్ని సందర్శిస్తారన్నారు.
ఆలయం చుట్టూ ఉన్న భూముల యజమానులు అభివృద్ధికి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకుఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సూర్యతండా మీదుగా కొమ్మాల వరకు బీటీ రోడ్డు వేశామన్నారు. త్వరలోనే జాతర నుంచి నాచినపల్లి వరకు రోడ్డు నిర్మిస్తామమన్నా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, కుడా డైరెక్టర్ వీ రాజ్కుమార్, ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, సర్పంచ్లు వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, నాగేశ్వర్రావు, మల్లారెడ్డి, పూండ్రు జైపాల్రెడ్డి, గీసుగొండ పీఎసీఎస్ చైర్మన్ రడం శ్రీధర్, నాయకులు రవీందర్రెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రా జేందర్, తిరుపతి, రాజు, స్వామి, రమేశ్, కేదారి, వేణు, బాలరాజు పాల్గొన్నారు.