జనగామ రూరల్, జూలై 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీపీ మేకల కళింగరాజు అన్నారు. ఇంకా మిగిలిన పనులుంటే సత్వరమే పూర్తి చేయాలని ఆయన కోరారు. శనివారం జరిగిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు అభివృద్ధి పనులపై వివరించారు.. ఈ సందర్భంగా కళింగరాజు మాట్లాడుతూ పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలున్నాయని చెప్పారు. సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే స్పందించడంలేదని పెంబర్తి ఎంపీటీసీ మూల రవి సభ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో చెరువులకు గండ్లు పడుతున్నాయని వాటిని గుర్తించి వేంటనే పూడ్చివేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నందున బాగు చేయాలని పలువురు సభ్యులను అధికారులను కోరారు. హార్టికల్చర్ అధికారి ఐలయ్య మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా పలువురు అధికారులు సభకు హాజరుకాకపోవడంతో వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ కళింగరాజు తెలిపారు. గానుగుపహాడ్ నుంచి బాషానగర్ తండాకు వెళ్లే రహదారిపై బీటీ వేయాలని, బ్రిడ్జి మంజూరు చేయాలని పలువురు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీడీవో బిరుదు హిమబిందు, ఎంపీవో ఉప్పుగల్లు సంపత్ కుమార్, సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బొల్లం శారదాస్వామి, బండ లక్ష్మీవెంకటేశం, వైస్ ఎంపీపీ గద్ద చంద్రశేఖర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు శానబోయిన శ్రీనివాస్, అంబాల ఆంజనేయులు, ఇట్టబోయిన రజిత, రేణుక, బానోత్ స్వరూప, తేజావత్ కల్యాణి, శివరాత్రి స్వప్న, ముక్క రాజయ్య, కీర్తి లక్ష్మీనర్సయ్య, లచ్చిరాంనాయక్, వివిధ శాఖల అధికారులు ఐలయ్య, రాజశేఖర్, కవిత, శ్రీనివాస్, భిక్షపతి పాల్గొన్నారు.