జగిత్యాల అర్బన్ : ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం ప్రత్యేక నిధులు రూ.3కోట్లతో గొల్లపల్లి రోడ్డు, మోతె రోడ్డులోని వైకుంఠధామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్డు, మోతె రోడ్డులోని వైకుంఠధామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధి నుంచి రూ.3కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో బర్నింగ్ ప్లాట్ఫాం, పాత్వే, గ్రీనరీ, కమాన్, డ్రైనేజీ సిస్టం, టాయిలెట్స్, లైటింగ్, తదితర అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని వివిధ వైకుంఠధామాల అభివృద్ధి పనులు ప్రారంభించామని, అందులో కొన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, కలెక్టర్ రవి, జడ్పీచైర్పర్సన్ వసంత, మున్సిపల్ అధ్యక్షురాలు శ్రావణి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.