కొడిమ్యాల : రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నేతలు పూజలు చేశారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలో ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
వారు కోలుకొని ప్రజాక్షేత్రంలో మళ్లీ తమ సేవలు అందించాలని ఆయురారోగ్యాలతో ఉండాలని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పర్లపల్లి ప్రసాద్, కొ ఆప్షన్ సభ్యుడు నసీరొద్దీన్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేశం, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, సెస్ సెల్ మండల అధ్యక్షుడు నేరెల్ల మహేష్, వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడు రాగి రఘు నందన్ ,కొడిమ్యాల పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, నాయకులు బైరి వెంకటి, మొగిలి పాలెం శ్రీనివాస్ ,కొలకాని సత్యం,చెల్ల లక్ష్మణ్,దీకొండ శేఖర్, కొలాపురం రమేష్, మొగిలి రాకేష్, శేఖర్ కాయిత రాజు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.