జగిత్యాల : జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తోట శేఖర్ అనే వ్యక్తి ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. కాగా, ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రత్న ప్రకాష్ మీడియా సమాశంలో తెలిపారు.
నిందితుల్లో సమిండ్ల మహేష్, వీర బత్తిని సాయి కిరణ్ ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.