జగిత్యాల : టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన గుడిసె హన్మయ్య ప్రమాదంలో మరణించాడు. అతడికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన ఇన్సురెన్స్ చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు కొండత భరోసా అన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు.
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, వైస్ ఎంపీపీ పోతాని రవి, మార్కెట్ కమిటీ చెర్మన్ జనగం శ్రీనివాస్, సింగిల్ విండో చెర్మన్ మధుసూదన్ రావు, సాగర్రావు, ర వివర్మ,అల్లూరి రాజేశ్వర్ రెడ్డి కొండగట్టు డైరెక్టర్ కొంక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.