జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలంలో పెద్దపులి సంచరిస్తున్నది. మండలంలోని శ్రీరాంపూర్ గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగుజాడలను పరిశీలించారు. అవి పెద్దపులి అడుగు జాడలుగానే ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.