జగిత్యాల : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జిల్లాలోని దమ్మన్నపేటలో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా జులై ఒకటో తేదీన మంత్రి పర్యటించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రాజు సతీష్ అనే దివ్యాంగుడు బ్యాటరీ సైకిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. బ్యాటరీ సైకిల్ అందజేస్తానని మంత్రి హామీనిచ్చారు. ఇచ్చిన మాట మేరకు మంత్రి రోజుల వ్యవధిలోనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఇప్పించి మాట నిలబెట్టుకున్నారు. తన బాధను అర్థం చేసుకొని బ్యాటరీ సైకిల్ అందజేసిన మంత్రికి సతీష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల