కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 21: గోపాల్పూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు తమవంతు కృషి చేస్తున్నారు. చామనపల్లి పీహెచ్సీ వైద్యురాలు శిరీష ఆధ్వర్యంలో సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. కాగా, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. మంగళవారం చెర్లభూత్కూర్లో 35 మంది, గోపాల్పూర్లో 91 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. చెర్లభూత్కూర్ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఉపసర్పంచులు ఆరె శ్రీకాంత్, చిట్కూరి శేఖర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు అంజయ్య, వేణు తదితరులున్నారు.
రామడుగు, సెప్టెంబర్ 21: మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ చివరి దశకు చేరినట్లు ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం వ్యాక్సినేషన్ నిర్వహించారు. వెదిరలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ నిర్వహణలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. రెండో డోసు చివరి దశకు చేరినట్లు తెలిపారు. కాగా, వెలిచాలలో వ్యాక్సినేషన్ను సర్పంచ్ వీర్ల సరోజన పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీవో సతీశ్రావు, సర్పంచులు తీగల సంగీత, గుండి మానస, తదితరులు పాల్గొన్నారు.