హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 14: గణనాథుడికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సాయిబాబా గుడి, హనుమాన్ ఆలయం, సూపర్బజార్రోడ్డు, వివేకవర్ధిని స్కూల్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను ఆయన సందర్శించారు. పూజారులు గెల్లు శ్రీనివాస్తో పూజలు చేయించి ఆశీర్వదించారు. ఆయా మండపాల నిర్వాహకులు గెల్లును శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా జీవించాలని గణనాథుడిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పటణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మక్కపెల్లి కుమార్యాదవ్, కల్లెపల్లి రమాదేవి, గోస్కుల రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు విడపు అనురాగ్, చొల్లేటి శ్యామ్, పంజాల శ్రీధర్గౌడ్, కాజిపేట శ్రీనివాస్, రమేశ్యాదవ్, హరీశ్గౌడ్, కిరణ్గౌడ్, కుడికాల అశోక్, అన్నలింగం, భాస్కర్చారి, చలపతిరావు, శ్రీధర్ తదితరులున్నారు.