చిగురుమామిడి, జూలై 20: మొకలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీపీ కొత్త వినీత పేర్కొన్నారు. భారత్కీ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మొకలు నాటే కార్యక్రమం చేపట్టారు. చిగురుమామిడిలో ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్ మొకలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొకలు ఎంతో దోహదపడతాయన్నారు. సెగ్రిగేషన్, వైకుంఠధామాల్లో విరివిగా మొకలు నాటాలని కోరారు. వర్షాలు కురవాలంటే ప్రతి ఒకరూ మొకలు నాటాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లె, ములనూరు, రేకొండ, సుందరగిరి, బొమ్మనపల్లి, ముదిమాణిక్యం తదితర గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, అంగన్వాడీ టీచర్లు మొకలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి, సోషల్ వెల్ఫేర్ డీడీ నతానియల్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీవో జిల్లా రాధ, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
తిమ్మాపూర్, జూలై 20 : గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో చింతల రవీందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మన్నెంపల్లి, నర్సింగాపూర్, పొలంపల్లి, నల్లగొండ, బాలయ్యపల్లి, రేణికుంట గ్రామాల్లో హరితహారంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్ల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లకిరువైపులా, వైకుంఠధామాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ ఎంపీవో కిరణ్కుమార్, సర్పంచ్లు మేడి అంజయ్య, బొజ్జ తిరుపతి, బోయిని కొమురయ్య, ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమ్మం కృష్ణ, ఉపాధిహామీ జేఈ హరీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
తిమ్మాపూర్, జూలై 20: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని తిమ్మాపూర్ సర్పంచ్ దుండ్ర నీలమ్మ, ఎంపీటీసీ వేల్పుల మమత పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ చుట్టూ బయోఫెన్సింగ్లో భాగంగా గోరింట, వెదురు, గన్నేరుతో పాటు వివిధ రకాలకు సంబంధించిన 300 మొక్కలు నాటారు. ప్రతి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు, కో ఆప్షన్ సభ్యుడు కొమురయ్య, కారోబార్ దేవేందర్ తదితరులున్నారు.