చొప్పదండి, ఏప్రిల్ 16: పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలసేకరణ నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తహసీల్దార్ రజిత, కమిషనర్ అంజయ్యకు సూచించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం పక్కన ఉన్న స్థలాన్ని మార్కెట్ ఏర్పాటు కోసం శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. ఇది వాకర్స్, క్రీడాకారులకు అనుకూలంగా ఉందని, అందుకే వసతి గృహం పక్కనే ఉన్న స్థలాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్కుమార్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గుర్రం హన్మంతరెడ్డి, దూస రాము, సామల రాజు, మంచాల మోహన్, తాటిపెల్లి అంజయ్య, సందీప్ తదితరులు ఉన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి
గంగాధర, ఏప్రిల్ 16: యువత స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మధురానగర్లో ఏర్పాటు చేసిన టీటైం టీస్టాల్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు రమణారెడ్డి, అంజి, శేఖర్రెడ్డి, శంకర్గౌ, మహిపాల్, అంజయ్య, జారతి సత్తయ్య, మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పాజిటివ్ రావడంతో సినిమా నుంచి తీసేశారు..
వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ