స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్: ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భగత్నగర్ వెంకటేశ్వర కాలనీలో సోమవారం ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు. మహిళలు తమ ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి, తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిని ఆరగించారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.