మల్యాలకు వైకుంఠ రథం అందజేయాలని ఎన్ఆర్ఐ సంతోష్ నిర్ణయం
ముందస్తుగా లక్ష నగదు అందజేత
మల్యాల, మే 22: సొంతూరిపై మమకారం చాటాడు ఓ ఎన్ఆర్ఐ. అంత్యక్రియల నిర్వహణకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వైకుంఠరథం అందజేసేందుకు ముందుకువచ్చారు మల్యాల గ్రామానికి చెందిన మిట్టపెల్లి సంతోష్కుమార్. వివరాల్లోకి వెళ్తే.. మల్యాలకు చెందిన రిటైర్డ్ అటవీశాఖ ఉద్యోగి మిట్టపల్లి లక్ష్మీనారాయణ కొడు కు సంతోష్కుమార్ అమెరికాలో స్థిరపడ్డారు. అయి తే ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గ్రామం లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రైవే ట్ వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగానూ సతమతమవుతుండగా, తన కుటుంబ సభ్యులద్వారా విషయాన్ని తెలుసుకున్న సంతోష్ వైకుంఠరథాన్ని సమకూర్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్తో చర్చించారు. వైకుంఠ రథానికి అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని చెప్పారు. ఈ మేరకు శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో పాలకవర్గ సభ్యులు, ఈవో రవీందర్ సమక్షంలో ముందస్తుగా తన తండ్రి లక్ష్మీనారాయణతో లక్ష ఇప్పించారు. ఇక్కడ స్థానిక ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు రాచర్ల రమేశ్, నాయకులు తాటిపాముల రాజేందర్, ప్రతాప్, నరేశ్, కొక్కుల రాజు, శనిగారపు తిరుపతి, నారాయణ పాల్గొన్నారు.