ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల విద్యానగర్, మే 21: కరోనా వైరస్ కట్టడికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో బ్లాక్ ఫంగస్, కొవిడ్-19పై శుక్రవారం జూమ్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ బ్లాక్ ఫంగస్, కొవిడ్ -19పై అవగాహన కల్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ను అరికట్టడానికి సహకరించాలని కోరారు. వైరస్ బారిన పడిన వారు సహాయం కోసం తనను కలవచ్చని తెలిపారు. ‘ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ద క్యూర్’ అని నినాదం చేశారు. సదస్సులో ప్రిన్సిపాల్ వాసం సచిన్, డీన్ శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్కుమార్కు సన్మానం
జగిత్యాల, మే 21: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఆటోనగర్, ఆటోస్టోర్ యూనియన్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా దుకాణాలు కోల్పోయిన వారికి ఆటోనగర్కు స్థలం కేటాయింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సతీశ్, రమణ, రిహాన్, రాజేశం పాల్గొన్నారు.