జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జూలపల్లిలో క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం
కమాన్పూర్, ఏప్రిల్ 15: క్రీడల్లో గెలుపోటములు సహజమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. జూలపల్లిలోని ఆదర్శనగర్లో గురువారం జూలపల్లి గ్రామస్థాయి క్రికెట్ టోర్నీలో మల్లికార్జున నగర్ (ప్రథమ), జైభీమ్ (ద్వితీయ) స్థానాల్లో నిలిచిన జట్లకు జడ్పీ చైర్మన్ బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఈ క్రికెట్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్రెడ్డి, ఆదివరాహస్వామి ఆలయ కమిటీ చైర్పర్సన్ ఇనగంటి ప్రేమలత, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు శెవ్వ శంకరయ్య, అబ్బిడి వినోద, ఉప సర్పంచ్ పోలుదాసరి సాయికుమార్, కాంట్రాక్టర్ సాన రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు వేముల సత్యనారాయణ పాల్గొన్నారు.