జగిత్యాల, మే 12 ః ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు, లాక్డౌన్ సంబంధిత అంశాలపై కలెక్టర్ బుధవారం జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో గత సీజన్లో ప్రతిరోజూ 12వేల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పోలిస్తే ఈఏడాది ప్రతిరోజూ 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 421 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసుకొని 416 కేంద్రాలను ప్రారంభించి, 1.98 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. జిల్లాలో ధాన్యం కోసం 59 రైస్ మిల్లులకు, 5 ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. మే చివరలో ధాన్యం ఎకువగా వచ్చే అవకాశం ఉన్నందున మందుస్తుగా తగిన ఏర్పాట్లు చేపట్టాలని పేరొన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సదరు వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీ జరగడం లేదని, ఇప్పటివరకు 1.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కేవలం 1.12 లక్షల మెట్రిక్ టన్నుల వివరాలు మాత్రమే నమోదు చేశామని, పెండింగ్కు గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.
కరోనా నేపథ్యంలో కొన్ని ఇబ్బందులతో వివరాలు ట్యాబ్ ఎంట్రీ ఆలస్యం అవుతుందని అధికారులు వివరించారు. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మేర ట్యాబ్ ఎంట్రీ చేయడానికి తాతాలికంగా సిబ్బందిని నియమించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, వాహనాల ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉండే సిబ్బందికి, వరర్లకు ప్రత్యేకంగా డ్యూటీ పాస్ అందించాలని, దీనిని వారు సద్వినియోగం చేసుకునేలా సూ చించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా నియంత్రణ కు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా సదరు కమిటీ నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.