జగిత్యాల, మే 12: రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా గురుకులాలను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్సిట్యూట్ బాలు ర, బాలికల 5వ తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్టర్ను ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురుకులాల ద్వారా సుమారు 50వేల మం దికి ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రభు త్వం విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు, భోజన వసతి కల్పించి గురుకులాలను ప్రైవేట్కు దీటుగా నిర్వహిస్తున్నదని ఉద్ఘాటించారు. ప్రతి మైనారిటీ గురుకుల పాఠశాలలో 25 శాతం ఇతర మతాల వారికి కూడా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. గురుకులాల అభివృద్ధికి పాటుపడుతున్న మం త్రి కొప్పుల ఈశ్వర్కు, వారి కుటుంబానికి కరోనా సోకిందని, వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు రాజేందర్, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా హాస్పిటల్లో ఉచిత భోజనం
జిల్లా హాస్పిటల్లో రోగుల సహాయకులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. చాగణం లలితమ్మ-భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2 బీహెచ్కే జగిత్యాల ఆధ్వర్యంలో దవాఖానలో రోగుల తరపు సహాయకులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి, ఆర్ఎంవో రామకృష్ణ, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, యూత్ నాయకులు కూతురు శేఖర్, సిబ్బంది, గౌరీ శంకర్ ఇన్ ఫ్రా బిల్డ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.