జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సారంగాపూర్, మే 21: కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. శుక్రవారం సారంగాపూర్లోని రైతువేదిక, బీర్పూర్ సహకార సంఘం ఆవరణలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సారంగాపూర్లో 17 మందికి రూ.3,77,500 విలువైన చెక్కులను, బీర్పూర్ మండలంలో 15మందికి రూ. 4.24లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మరిందన్నారు. కార్యక్రమాల్లో జడ్పీ సభ్యుడు మేడిపెల్లి మనోహర్ రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి, నారపాక రమేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అమీర్, ప్రజాప్రతినిధులు, నాయకులు జోగిన్పెల్లి సుధాకర్ రావు, గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్, ఎడ్ల సృజన, సుశిన్, రమేశ్, రామచంద్రం గౌడ్, రామకిష్టు గంగాధర్, చెన్న సంతోష్, గంగాధర్, అనీల్, బుచ్చన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.
బ్లాక్ ఫంగస్తో ఆందోళన అవసరం లేదు
బ్లాక్ ఫంగస్తో వ్యాధితో ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధైర్యం చెప్పారు. చెక్కుల పంపిణీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మధ్యనే బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్నదని, అది కొత్త వ్యాధి కాదని, గతంలో కూడ ఉండేదని, కరోనా వైద్యం కోసం వాడే మందుల వల్ల శరీరంలో కొంత రోగనిరోధక శక్తి తగ్గి ఈ బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. సీఏం కేసీఆర్ జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తాను మెడికల్ కాలేజీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.