కొండగట్టు: రాష్ట్రంలో ప్రముఖ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయి.. బయట కూడా బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది.
సమ్మక్క జాతర కావడంతో వనదేవతలను దర్శనానికి వెళ్తున్న, వస్తున్నవారు కొండగట్టు అంజన్న ఆలయానికి క్యూకడుతున్నారు. దీంతోపాటు మంగళవారం కావడంతో ఆలయం భక్తుల రద్దీ నెలకొన్నదని అధికారులు వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వామి దర్శన ఏర్పాట్లు చేశామన్నారు.