జగిత్యాల: జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షునిగా గాలిపెల్లి నర్సయ్య ఎన్నికయ్యారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఎన్నికల్లో గాలిపెల్లి నర్సయ్యతో పాటు పలువురు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. సంఘం ప్రధాన కార్యదర్శి పాల్తేపు శంకర్, కోశాధికారిగా వడ్లకొండ రవీందర్ గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాలిపెల్లి నర్సయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.