కోరుట్ల : తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. గురువారం వారు పట్టణంలోని కల్లూరు రోడ్డు ఎస్సారెస్పీ క్వార్టర్స్ సముదాయంలో నూతనంగా నిర్మించనున్న కేడీసీసీ బ్యాంకు, సహకార సంఘ భవనం, గోదాం నిర్మాణ పనుల శిలాఫలకాలను ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
దేశంలోనే ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిలువచేసే గోదాంలను నిర్మించడం జరిగిందన్నారు. 4 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారని, 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రానున్నదన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీ భవనాలను నిర్మిస్తున్నామని, పంట నిల్వ కోసం అవసరమైన చోట్ల గిడ్డంగులను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
రైతుల మేలు కోరే ప్రభుత్వానికి అన్నదాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకటరావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, సొసైటీ చైర్మన్లు, ఏఎంసీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షల వెల్లువ..
టీటీడీ సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావును గురువారం ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు జడ్పీచైర్పర్సన్ దావ వసంత, డీసీసీబీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావుతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.