జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్
సారంగాపూర్: గ్రామాల్లో చేపడుతున్న వానకాలం పంటల లెక్కలు పక్కగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని బట్టపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల, కోనాపూర్, సారంగాపూర్ గ్రామాల్లో పర్యటించి పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలో ప్రతి గుంట లెక్కన ఏఏ పంటలు పండించారనే వివరాలను సర్వే నంబర్ల వారీగా పరిశీలించారు. పంటల
దిగుబడులపై రైతులకు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ సలహాలు ఇవ్వాలని, వచ్చే వారం నుంచిరైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏఈఓలకు సూచించారు. ఆయా గ్రామాల్లోని రైతులు ఆయిల్పామ్ తోటల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఓ తిరుపతి నాయక్, కోల శ్రీనివాస్, ఏఈఓలు ఆంజనేయులు, వెంకటేశ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.