మెట్పల్లి టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆమె కోరారు.