గొల్లపల్లి : గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ (పీడీ) గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మంగళవారం ఉదయం ప్రియురాలు ఆందోళనకు దిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిర్మలాపూర్ (పీడీ) గ్రామానికి చెందిన తిరుమల్రావు తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోపారపు లత తన తల్లితో వచ్చి తిరు మల్రావు ఇంటి ఎదుట ఆందోళన చేసింది. లత ఈ నెల 24వతేదీన రుద్రంగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి తిరుమల్రావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం అతడు కరీంనగర్ జైల్లో ఉన్నాడు. లత తండ్రి, తిరుమల్ రావులిద్దరు గతంలో దుబాయి లో ఒకే గదిలో ఉండేవారు, అక్కడ వారిద్దరి మధ్య ఉన్న స్నేహంతో లత అతడికి పరిచయమైంది. దీంతో ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. తరువాత వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తిర్మలాపూర్ (పీడీ) గ్రామంలో ఆందోళనకు దిగిన లత, ఆమె తల్లిని గొల్లపల్లి ఎస్ఐ మనోహర్ రావు సముదాయించి ఇంటికి పంపించారు.