జగిత్యాల : జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు. గమనించిన ఇంటి యజమాని లేచి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు.
ఉదయం4.30 నిమిషాల కు ఆ ఇంటికి దగ్గరలోని మిరియాల జగన్ రావు ఇంటి వెనుకాల నక్కిన దొంగలు అతను తలుపు తీసి బయట ఉన్న బాత్ రూములోకి వెళ్లాడు. బాత్ రూం బయట గడియ పెట్టారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన దొంగలు జగన్ రావు ప్యాంట్ జేబులో ఉన్న ఐదు వేలు తీసుకొని పారిపోయారు.