పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందిస్తాం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ
కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ
రాంనగర్, జూలై 30: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమారుల గుండెల్లో దడ పుట్టిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సత్వరం స్పందించి మెరుగైన సేవలందిస్తామని, పోలీస్శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శుక్రవారం నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనరేట్ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు కేసులను ఛేదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడి మళ్లీ అదే తరహా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2017 నుంచి వివిధ అంశాల్లో కరీంనగర్ కమిషనరేట్ దేశ వ్యాప్తంగా గుర్తింపును సాధిస్తున్నదని, అదేస్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఇకడి ప్రజలు కుల, మత, వర్గ విభేదాలను విడనాడి శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు తమవంతు సహకారం అందించడం ఆహ్వానించదగిన పరిణామమని పేరొన్నారు.
‘యూనిఫాం సర్వీస్ డెలివరీ’కి ప్రాధాన్యం
యూనిఫాం సర్వీస్ డెలివరీ విధానం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని సీపీ చెప్పారు. వివిధ విభాగాల పనితీరును మెరుగుపరచడంతో పాటు టెక్నాలజీ వినియోగంపై అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. వాహనదారులందరూ రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని కోరారు. వాహనాల నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయడం, నకిలీ స్టిక్కర్లు అతికించి నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే వివరాలు
కమిషనరేట్ వ్యాప్తంగా ఎకడ నేర ఘటన జరిగినా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వెంటనే వివరాలను వెల్లడిస్తామని సీపీ తెలిపారు. కొన్ని సందర్భాల్లో నేర ఘటనలో ఆధారాలు చెదిరిపోకుండా చూసే క్రమంలో వివరాల వెల్లడికి కొంత సమయం పడుతుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు.
పోలీసులు సంసిద్ధంగా ఉండాలి
కరీంనగర్ కమిషనరేట్లోని అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు సమర్థవంతంగా సేవలందించేందుకు మానసికంగా, శారీరకంగా రేయింబవళ్లు సంసిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ సూచించారు. కమిషనరేట్లోని పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారికి పలు సూచనలు చేశారు. అన్నివర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, ఛేదనలో కీలకపాత్ర పోషించే పోలీసులకు శాఖాపరంగా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చిన ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా విని, పరిషరించాలని చెప్పారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, జీ చంద్రమోహన్, పీ అశోక్, ఏఎస్పీ రితిరాజ్, ఏసీపీలు విజయసారథి, శ్రీనివాస్, మదన్లాల్, శివభాస్కర్, రాములు, తుల శ్రీనివాస్రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.