జగిత్యాల : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను మేడిపల్లి వాసులైన శ్రీకాంత్ (27), నవీన్ (23), పవన్ (22)గా గుర్తించారు. మేడిపల్లి నుంచి జగిత్యాల వైపు బైక్పై వెళ్తున్న యువకులు కారును ఓవర్టేక్ చేసే క్రమంగా నేరుగా లారీని ఢీకొట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.