హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నిరంతరం పరితపించే వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై కొన్ని దినపత్రికలు తప్పుడు రాతలు రాయడం బాధాకరమని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్షోలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తుండగా మంత్రి ఈటల రాజేందర్నే బద్నాం చేయడం సరికాదన్నారు. ఈటలకు కరోనాను ఆపాదిస్తూ, వైద్యులు, ప్రజలను రెచ్చగొట్టేలా అభ్యంతరకర రాతలు రాసిన పత్రికలు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, కల్లెపల్లి రమాదేవి, గోస్కుల రాజు, మక్కపెల్లి కుమార్, నాయకులు గందె శ్రీనివాస్, మొలుగూరి ప్రభాకర్, రాపర్తి శివ, బీఎస్ ఇమ్రాన్, కల్లెపల్లి రోషేందర్, గుడ్డెల్గుల సమ్మయ్య, సంపంగి రాజేందర్, కొలిపాక రవి, యాదగిరి, విడపు రాజు, దిల్ శ్రీను, రమేశ్యాదవ్, సారయ్యగౌడ్, సమ్మయ్యగౌడ్, మధూకర్, జంపయ్య, సత్యం, భాస్కర్, రాజయ్య, చారి తదితరులు పాల్గొన్నారు.