ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నిరాడంబరంగా వేడుకలు
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 27: నగరంలోని పలు ఆలయాల్లో హనుమాన్ చిన్నజయంతి వేడుకలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో అభిషేకాలు, హారతులు రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. పలువురు హనుమాన్ దీక్షాపరులు ఆలయాల్లో పూజలు చేశారు. పలువురు భక్తులు దీక్ష స్వీకరించారు. గణేశ్నగర్, కట్టరాంపూర్, ప్రశాంత్నగర్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలు, జ్యోతినగర్ హనుమాన్ సంతోషీమాత ఆలయం, పాతబజార్లోని చిన్న హనుమాన్ ఆలయం, రాంనగర్ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం, పాతబజార్ శివాలయం, భారత్టాకీస్ రోడ్డులోని వీరాంజనేయస్వామి ఆలయం, భగత్నగర్లోని అంజనాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భక్తులు ఆలయాలకు తక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆయా ఆలయ కమిటీల సభ్యులు, ఈవోలు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 27: జూబ్లీనగర్లోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి నిర్వహించారు. గురుస్వామి రమేశ్స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాపరులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమం జరిపించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్షాపరులు సంతోష్గౌడ్, మునిరెడ్డి, కుమార్, రాజు, రాములు, శ్రీనివాస్ రాజయ్య, ఆంజనేయులు, ఊరడి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.