అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ
ఈ నెల 31 నుంచి 4 వరకు తరగతులు
దరఖాస్తుకు ఈ నెల 30దాకా గడువు
జగిత్యాల, మే 26: కాలానుగుణంగా ఉపాధ్యాయులకు బోధన నైపుణ్యాలను పెంపొందించేలా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చర్యలు తీసుకుంటున్నది. అంతరిక్షంపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఆన్లైన్లో శిక్షణ తరగతుల కోసం శ్రీకారం చుట్టింది. ఇందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30లోగా అవకాశం కల్పించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమో ట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్)ప్రత్యేక కోర్సును సిద్ధం చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిజిటల్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అందించనున్నారు. ఇస్రో 2007 నుంచి ఇప్పటివరకు 76సార్లు ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణనిచ్చింది. దేశవ్యాప్తంగా 3.05లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు ఇస్రో వెల్లడించింది. ఆన్లైన్లో ఇచ్చే శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్లో ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.
రిజిస్ట్రేషన్ ఇలా..
ఈ నెల 31నుంచి జూన్ 4వరకు ఇస్రో ఆన్లైన్లో ఉపాధ్యాయులకు అందించే శిక్షణకు దరఖాస్తులను http;//www.iirs.gov.in/ EDU SAT.newsలో సెల్నంబర్, జీమెయి ల్, పేరు, చిరునామా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి శిక్షణలో పాల్గొనే అవకాశం ఉంటుంది. శిక్షణలో 70 శాతం హాజరు ఉండి సత్తాచాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్ ద్వారా సర్టిఫికెట్ అందిస్తుంది.
శిక్షణ అంశాలు
ఇస్రో ఈ నెల 31నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో అందించే శిక్షణలో పలు అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం-వాటి అనువర్తనాలపై శిక్షణ ఉంటుంది. ఆర్థిక, సామాజికాభివృ ద్ధి, వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తిగా ఆయా అంశాల్లో నిపుణులు తరగతులను నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఉపాధ్యాయులకు ఇస్రో అందించే శిక్షణ ఎంతో ఉప యుక్తంగా ఉంటుంది. నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
నైపుణ్యం పెంచుకోవాలి
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం.. వాటి అనువర్తనా లు అనే ప్రధాన అంశాలపై శిక్షణ ఉపాధ్యాయులకు బోధన పరిజ్ఞానాన్ని పెం పొందిస్తుంది. నూతన అం శాలతో నైపుణ్యాన్ని పెంచుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది. ఉపాధ్యాయులు ఇస్రో వెబ్సైట్లో శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి.