నేటి నుంచి అందించేందుకు సర్వం సిద్ధం
మొదట అందరికీ మంజూరు పత్రాలు
ఉమ్మడి జిల్లాలో 24వేల పైచిలుకు కొత్తవి
మొత్తం 9.89 లక్షలకు చేరనున్న సంఖ్య
కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మెట్పల్లి: నేటి నుంచి రేషన్కార్డుల జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్జీదారుల్లో అర్హులందరికీ కొత్త కార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మొదట మంజూరు ధ్రువీకరణ పత్రాలు అందజేయనుండగా, త్వరలో సరికొత్త నమూనాతో కార్డులను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24,034 కొత్త కార్డులు ఇవ్వనుండగా, పాతవాటితో కలుపుకుని ఈ సంఖ్య 9,89,081కి చేరుకోనున్నది. కొత్త కార్డులు రానుండడంతో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అర్జీదారుల కల నెరవేరనున్నది.
రేషన్ కార్డుల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అర్జీదారుల కల నెరవేరనుంది. అర్హులందరికీ కొత్త రేషన్కార్డు లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులకు సంబంధించి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వా రిని గుర్తించాలని పౌరసరఫరాల, రెవె న్యూ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రి వివరాలు సేకరించిన అధికారయంత్రాగం.. ఆ మేరకు అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించింది. వీటిన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు ఇవ్వడానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. నేటి నుంచి పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. కొత్త రేషన్కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ముందుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్న ప్రభుత్వం, త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి మంజూరు పత్రాలు ఇచ్చిన వారికి అందజే యనున్నది.
24వేల కొత్త కార్డులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా 24.034 మందికి రేషన్కార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారయంత్రాగం.. అర్హులను గుర్తించి ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు అందించింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 9.65 లక్షల పైచిలుకు రేషన్కార్డులుండగా, కొత్తవాటిని కలుపుకొని 9.89 లక్షల పైచిలుకు చేరుకోనున్నాయి. ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నా ప్రజల అవసరాలే లక్ష్యంగా కొత్త రేషన్ కార్డులను జారీచేస్తోంది. ఇందుకోసం సోమవారం నుంచి అన్ని చోట్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసింది.