త్వరలోనే 6లక్షల బీమా పథకం
విధివిధానాలు రూపొందించాలని ఆదేశం
హుజూరాబాద్లో 26,500మందికి లబ్ధి
మత్య్సకారుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు
హుజూరాబాద్, జూన్ 23:సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుపేద మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర సర్కారు వెలుగులు నింపుతున్నది. ఓ వైపు వట్టిపోయిన చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించడంతోపాటు ఐదేళ్ల కిందట ఉచిత చేపపిల్లల పంపిణీని ప్రారంభించి, జలవనరుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా కాళేశ్వరం జలాలు ఊరూరికి పంపిస్తుండడంతో జలవనరుల్లో పుష్కలంగా నీరు చేరి మత్స్య సంపద దండిగా పెరుగుతుండడంతో మత్స్యకారుల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది.
కుటుంబాలకు ఆసరైతది..
గత ప్రభుత్వాలు మమ్ముల పట్టించుకోలె. తెలంగాణ అచ్చినంకనే మాకింత పని దొరుకుతంది. చెరువులల్ల నీళ్లు లేక, సాప పిల్లలు లేక మాకు కులవృత్తి లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ సారు అచ్చినంక చెరువులల్లకు నీళ్లచ్చినయి, ఉచితంగా సాప పిల్లలచ్చినయి. సబ్సిడీతో లూనా బండ్లు కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు బాధలు తీరినయి. చెరువుల్ల, కుంటలల్ల ఏసిన సాపపిల్లలు పెరిగి మాకు ఇంత పనిదొరుకుతంది. నాలుగైదు పైసలు వత్తున్నయ్. ఇప్పటిదాక ప్రమాదవశాత్తూ మా దాంట్ల ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు అచ్చేటియి. దానిని కేసీఆర్ సారు 6లక్షలకు పెంచుతా అంటుండు. మా కుటుంబాలకు ఇగ ఎలాంటి ఢోకాలేదు. ఆ పైసలతోనైనా ఉన్నోళ్లు మంచిగ బతుకుతరు.
– మోటం ఐలయ్య, మత్స్యకారుడు (వీణవంక)