రూ. 70 కోట్లతో నగరంలో పనులు
మేయర్ వై సునీల్రావు
47వ డివిజన్లో పలు ప్రగతి పనులు ప్రారంభం
కార్పొరేషన్, మే 20: పేదలు నివసించే కాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టామని మేయర్ వై సునీల్రావు ప్రకటించారు. తొలి ప్రాధాన్యతగా తీసుకొని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 70 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. 47వ డివిజన్లో రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డివిజన్లల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంచినీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టామని వివరించారు. హౌసింగ్బోర్డు ఏరియాలో 24 గంటల మంచినీటి సరఫరా కోసం పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని చెప్పారు. డంపింగ్ యార్డు ద్వారా వచ్చే పోగతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు రూ. 18 కోట్లతో బయోమైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. పది రోజుల్లో టెండర్ పక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. డంపింగ్ యార్డును క్లియర్ చేసి ఆ స్థలంలో గ్రీనరీతో పార్కును నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజు నగరంలో వచ్చే చెత్తను మై నింగ్ చేసి డంప్యార్డులో చెత్త పేరుకపొకుండా చూస్తామన్నారు. కార్పొరేటర్ షరీఫొద్దీన్, నాయకులు హామీద్, హాఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహం..
నగరంలోని వాల్మీకినగర్లోని స్లాటర్హౌస్ వద్ద అపరిశుభ్రత వాతావరణం కనిపించడంతో నగర మేయర్ వై సునీల్రావు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. గురువారం స్లాటర్ హౌస్ తో పాటుగా కశ్మీరర్ గడ్డలోని రైతుబజార్ను కూ డా పరిశీలించారు. ఈ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇ లా ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలు ఉంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అన్ని మార్కెట్లు, స్లాటర్ హౌస్లను పరిశుభ్రంగా ఉంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో స్థానికంగా ఉండే వ్యాపారులు, రైతులు కూడా సహకరించాలని కోరారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. ఇలాంటి వాతావరణం ఉంటే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని అధికారులకు సూ చించారు. ప్రతి రోజు స్లాటర్ హౌస్లను శుభ్రం చేయాలని నిర్దేశించారు. ఇకపై అపరిశుభ్ర వాతవరణం ఉంటే అధికారులు, సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, తహరీన్, పాల్గొన్నారు.