అవును.. వినాయక్ హీరో అయ్యాడు కదా ఆ మధ్య.. ఆయన కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో సీనయ్య అనే సినిమా కూడా మొదలైంది.. బాగానే హడావిడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏమైంది..? దీని గురించి అందరూ మరిచిపోయారు. అసలు వినాయక్ హీరోగా నటిస్తున్న సీనయ్య సినిమా ఏమైంది.. ఎక్కడికి పోయింది..? దీని గురించి ఇప్పుడు అసలు నిజాలు బయటికి వచ్చాయి. అప్పట్లో రాజును దిల్ సినిమాతో నిర్మాతను చేసాడు వినాయక్. అందుకే సీనయ్య సినిమాతో వినాయక్ ను హీరో చేయాలనుకున్నాడు దిల్ రాజు.
ఆయన్ని నమ్మి ఈ చిత్రం మొదలు పెట్టాడు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమా మాదిరే ఈ చిత్ర కథ కూడా ఉంటుంది. తన కూతురును చంపేసిన వాళ్లపై పగ తీర్చుకునే తండ్రి పాత్ర ఇది. వినాయక్ కు ఇది సరిగ్గా సరిపోతుందని భావించిన దిల్ రాజు.. నటుడిగా మార్చేసాడు. అయితే హడావిడిగా మొదలైన ఈ చిత్రం ఆ తర్వాత ఆగిపోయింది. అప్పట్లో రాజమౌళితో సమానంగా.. ఇంకా చెప్పాలంటే మాస్ సినిమాల్లో ఆయన కంటే ఓ మెట్టు పైనే ఉండేవాడు వినాయక్.
ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, కృష్ణ లాంటి విజయాలతో దుమ్ము దులిపేసాడు వినాయక్. ఆ తర్వాత ఈయనకు బ్యాడ్ టైమ్ నడిచింది. ఖైదీ నెం 150 కూడా బాగానే ఆడినా దానికి ముందు చేసిన అఖిల్.. తర్వాత చేసిన ఇంటిలిజెంట్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. అదే సమయంలో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి సీనయ్యతో హీరో అయ్యాడు. ఆ సినిమా కోసం బరువు కూడా తగ్గాడు. ‘శరభ’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. కానీ ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
దీనికి అసలు కారణాలు ఇప్పుడు బయటపెట్టాడు వినాయక్. తాను సినిమాలు చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి.. తాను ఏదో అనుకోవడం.. అది బయటికి మరోలా రావడం.. చివరికి ఎటూ కాకుండా పోయాయని చెప్పుకొచ్చాడు వినాయక్. కాలం కలిసిరాకపోతే ఏం చేసినా.. ఏం చెప్పినా వినాల్సి వస్తుంది.. భరించాల్సి వస్తుందని చెప్పాడు వినాయక్. అలా సీనయ్య కూడా అలా జరిగిపోయింది. సినిమా అంతా చేసిన తర్వాత చూసుకుంటే అస్సలు బాగా రాలేదని అర్థమైంది.. అందుకే ఆపేసామంటున్నాడు వినాయక్.
అప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయిపోయిందని చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పట్నుంచి వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు వినాయక్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ను బాలీవుడ్లో లాంఛ్ చేస్తూ ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు వినాయక్